జాతీయ వార్తలు

ఆశారాంకు 750కోట్ల జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరత్, ఏప్రిల్ 22: వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపు, ఆయన కుమారుడికి ఆదాయ పన్ను శాఖ 750 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఆశారాం బాపు ఆశ్రమాలపై జరిపిన దాడుల్లో కోట్లాది రూపాయల నగదు, ఇతర ఆస్తిపత్రాలు లభ్యమయ్యాయని ఎసిపి ముఖేష్ పటేల్ వెల్లడించారు. ఈ దాడుల్లో కోట్లాది రూపాయలున్న 42 బ్యాగులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీంతో లెక్కల్లో లేని ఈ నగదుపై ఆదాయ పన్ను శాఖ 750 కోట్ల జరిమానా విధించింది. ఈ విషయాన్ని ఆశారాం న్యాయవాది కపిలేశ్ దేశాయ్ ధ్రువీకరించారు.