జాతీయ వార్తలు

స్వైన్‌ఫ్లూతో ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, మార్చి 21: స్వైన్‌ఫ్లూ మహమ్మారి చాపక్రింద నీరులా విస్తరిస్తూ అమాయక ప్రజల ప్రాణాలను తోడేస్తూనే ఉంది. వ్యాధితో తాజాగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పలగూడకు చెందిన సుమన్ (23) వారం రోజుల క్రితం మహవీర్ ఆసుపత్రిలో చేరి వ్యాధి నిర్థారణలో స్వైన్‌ఫ్లూ బయటపడడంతో ఈనెల 17న గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుమన్ సోమవారం తుదిశ్వాస విడిచాడు. హిమాయత్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్ (22) అదే విధంగా బోయిగూడకు చెందిన ఆరు నెలల గర్భిణీ వనిత(29) స్వైన్‌ఫ్లూ వ్యాధితో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చలికాలంలో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందని గతంలో వేసవిలో ఈ వ్యాధి ఎక్కడ కనిపించకపోయిన ఈ మధ్య వేసవిలో సైతం విస్తరిస్తూ ఉండడంతో ప్రజలను ఒకింత భయాందోళనలకు గురిచేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.