జాతీయ వార్తలు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఢిల్లీ తెలంగాణ ప్రజావేదిక మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత రెండు వారాల నుండి సమ్మె చేస్తున్న తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు ఢిల్లీ తెలంగాణ ప్రజావేదిక తమ మద్దతు ప్రకటించింది. ఢిల్లీ తెలంగాణా ప్రజావేదిక జేఏసీ కో-కన్వీనర్ బోయిన రాజ్‌కుమార్, జేఏసీ సభ్యుడు గజవెల్లి నరసింహరాములు ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు. బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకుంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియంతృత్వ ధోరణి మూలంగా రాష్ట్ర ప్రజలు దుర్భర జీవితాలను గడపాల్సి వస్తోందని వారు ఆరోపించారు. ఆర్టీసీ సిబ్బంది రెండు వారాల నుండి సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటం సిగ్గు చేటని వారు దుయ్యబట్టారు.