జాతీయ వార్తలు

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు రూ.2.19, డీజిల్‌పై లీటరుకు 98 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. ధరల తాజా సవరణతో ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.61.87కి చేరింది. గత మార్చి 17న కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై చమురు సంస్థలు భారీగా వడ్డన జరిపాయి. లీటరు పెట్రోల్ రూ.3.07 పెంచగా, డీజిల్ రూ.1.90కి పెంచారు. అంతర్జాతీయగా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి ధరలు పెరగడం, రూపాయి మారకం రేటు కారణంగా ధరల సవరణ జరపాల్సి వచ్చిందని ఐఒసి ఒక ప్రకటనలో పేర్కొంది.