జాతీయ వార్తలు
పిఓకెలో దుర్ఘటన..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 25 September 2016
ముజఫరాబాద్, సెప్టెంబర్ 24: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఒక మినీ బస్సు నదిలో పడిపోయిన సంఘటనలో 23 మంది మరణించారు. ముజఫరాబాద్కు 45 కి.మీ దూరంలో శుక్రవారంనాడు ఈ ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి 100 మీటర్ల కిందనున్న నదిలో పడిపోయిందని స్థానిక అధికారులు తెలిపారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిలో 23 మంది చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని వారు తెలిపారు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మృతదేహాలు గాలింపు ఇబ్బందిగా తయారైందని, ప్రస్తుతానికి మూడు మృతదేహాలను వెలికి తీయగలిగామని తెలిపారు.
మినీ బస్సు నదిలో పడిపోయన ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్న పాక్ భద్రతా సిబ్బంది