జాతీయ వార్తలు

ఉజ్జయినీలో రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉజ్జయినీ (ఎంపీ), సెప్టెంబర్ 24: ఉజ్జయినీ సమీపంలో శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతులంతా కూలి పని చేసుకునేవారే. దేవాస్-ఉజ్జయినీ రోడ్డులో చందేసారా గ్రామానికి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న జీపు-ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌పి మనోహర్ వర్మ తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ 19 మందిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోయా బీన్స్ లోడుతో ఉజ్జయినీ వెళుతున్న ట్రక్కు ఎదురుగా ప్రయాణికులతో వస్తున్న జీపును ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు.