జాతీయ వార్తలు

అరకుకు ప్రత్యేక ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: వెనుకబడిన ప్రాంతం అయిన అరకుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీనీ కోరినట్లు ఎంపీ కొత్తపల్లి గీత తెలిపారు.గురువారం ప్రధానిని కలిసిన అనంతరం గీత విలేఖరులతో మాట్లాడారు. ప్రధాని గ్రామీణ సడక్ యోజన కింద నిధులివ్వాలని కోరామన్నారు. హైదరాబాద్‌లో తప్ప తనకు ఇంకెక్కడా భూములు లేవని, అధికారులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని గీత మండిపడ్డారు.ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఈ వ్యవహరంలో హోంశాఖ రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్, డీజీపిలకు ఫిర్యాదు చేశానని, న్యాయం జరిగే వరకూ పోరాడుతానని వెల్లడించారు. ప్రైవేటు భూముల విషయంలో ప్రభుత్వ జోక్యం ఏమిటని ప్రశ్నించారు. కొన్ని పత్రికలు తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నయని ఆరోపించారు.