జాతీయ వార్తలు
జిఎస్టి రేటు 20శాతానికి పెంచండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 23 September 2016
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: జీఎస్టీ రేటు పరిధిని 18 శాతం నుంచి 20 శాతం ఉండేలా చూడాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్వర్యంలో జరిగిన జీఎస్టీ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు హాజరైయ్యారు. ఈ సమావేశంలో మూఖ్యంగా జీఎస్టీ రేటులో మినహాయింపులు ఇతర అంశాలపై చర్చ జరిగినట్టు ఆయన తెలిపారు. కోటిన్నరకు పైగా వ్యాపార లావాదేవీలు జరిపే వ్యాపారుల నుంచి పన్ను వసూలు చేసుకోనే అధికారం పూర్తిగా రాష్ట్రాలకే ఉండాలని, ఈ విషయంలో కేంద్రం జోక్యం తగదని చెప్పామన్నారు. నేటి చర్చలు పూర్తికానందున శుక్రవారం కూడా సమావేశం కొనసాగుతుందని చెప్పారు.