జాతీయ వార్తలు

వీవీప్యాట్ మెషీన్‌లో అనుకోని అతిథి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నూర్ (కేరళ), ఏప్రిల్ 23: పోలింగ్ బూత్‌లో అనుకోని ‘అతిధి’ రావడంతో ఎన్నికల సిబ్బంది, ఓటర్లు హతాశులయ్యారు. ఆ అతిధి ఎవరో కాదు. సాక్షాత్తూ పాము. కేరళలో మంగళవారం లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. కన్నూర్ లోక్‌సభ పరిధిలోని మయ్యిలి కండక్కై పోలింగ్ బూత్‌లో సిబ్బంది తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఓటర్లు భారీగానే క్యూలైన్‌లో ఓటు వేసేందుకు వేచిచూస్తున్నారు. ఈ సందర్భంగా వీవీప్యాట్‌లో పాము కనిపించడంతో ఎన్నికల అధికారులు, సిబ్బందితో సహా ఓటర్లు సైతం ఒకింత ఆందోళన చెందారు. అయితే, ఆ తర్వాత ఆ పామును వీవీప్యాట్ నుంచి బయటకు తీయడంతో అంతా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. పాము భయంతో కాసేపు పోలింగ్‌కు అంతరాయం కలిగినా అనంతరం ఓటింగ్ కొనసాగింది. కన్నూర్ లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ పీకే శ్రీమతి (సీపీఐ-ఎల్‌డీఎఫ్), కే.సురేంద్రన్ (కాంగ్రెస్-యూడీఎఫ్), సి.కే.పద్మనాభన్ (బీజేపీ-ఎన్డీయే) పోటీ చేస్తున్నారు.