జాతీయ వార్తలు

ఏపికి నిధుల వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 31: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం 18 వందల కోట్లు విడుదల చేసిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. గురువారం నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో జరిగిన ఒక సమావేశానికి హైజరైన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వారం పది రోజుల్లో సిఎస్‌టి కింద మరో 650 కోట్లు విడుదల చేయనుందని అన్నారు. రాష్ట్రానికి మొత్తం 2,450 కోట్ల రూపాయలు అందుతాయని మంత్రి చెప్పారు. రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద వెయ్యి కోట్లు, అమరావతి నిర్మాణానికి రెండు వందల కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆరు వందల కోట్లు గురువారం రాత్రి రాత్రి విడుదల చేసిందని సుజనా చౌదరి ప్రకటించారు. ఆర్థిక సంవత్సరం ఆఖరు రోజున కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయటం గమనార్హం. ఇదిలా ఉంటే సిఎస్‌టి కింద మరో 650 కోట్ల రూపాయలను వారం పది రోజుల్లో విడుదల చేస్తారని మంత్రి పేర్కొన్నారు.