జాతీయ వార్తలు
ఎన్నికల ప్రచారానికి రేపు మాయావతి శ్రీకారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 20 August 2016
లక్నో: వచ్చే ఏడాది జరిగే యుపి అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే కోలాహలం మొదలైంది. బిఎస్పి అధినేత్రి, మాజీ సిఎం మాయావతి ఆదివారం నాడు ఆగ్రాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. గత సాధారణ ఎన్నికల్లో బిజెపి తరఫున నరేంద్ర మోదీ ఆగ్రా నుంచే సమరశంఖాన్ని పూరించారు. అక్కడి నుంచే తన ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టాలని మాయావతి నిర్ణయించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రచారం సందర్భంగా ముఖ్యంగా దళితులు, ముస్లిం ఓటర్లను కలుసుకునేందుకు, వారానికి ఒక చోట ర్యాలీ జరపాలని మాయావతి భావిస్తున్నారు. ప్రధానంగా బిజెపి, సమాజ్వాదీ పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఆమె ప్రచార యాత్ర కొనసాగుతుందని బిఎస్పి వర్గాలు చెబుతున్నాయి.