జాతీయ వార్తలు
మాయావతిపై బిజెపి నేత అనుచిత వ్యాఖ్యలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 July 2016
దిల్లీ: పార్టీ టిక్కెట్లను ఎక్కువ డబ్బులకు అమ్ముకుంటూ బిఎస్పి అధినేత్రి మాయావతి ఓ వేశ్యలా వ్యవహరిస్తున్నారంటూ యుపికి చెందిన బిజెపి నాయకుడు దయాశంకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు బుధవారం రాజ్యసభలో దుమారం సృష్టించాయి. దళిత మహిళపై ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసినందుకు దయాశంకర్పై చర్యలు తీసుకోవాలని బిఎస్పి ఎంపీలు పట్టుబట్టడంతో రాజ్యసభలో గందరగోళం చెలరేగింది. దీంతో సభను రేపటికి వాయిదా వేశారు. కాగా, తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దయాశంకర్పై బిజెపి నాయకత్వం కఠినచర్యలు తీసుకోవాలంటూ మాయావతి డిమాండ్ చేశారు. ఆమెకు ఇతర పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి.