జాతీయ వార్తలు
41 మంది మంత్రులతో మమత ప్రమాణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 27 May 2016
కోల్కత: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా శుక్రవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్కు బదులు రెడ్రోడ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆమెతో పాటు 41 మంది మంత్రులు ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ వీరి చేత ప్రమాణం చేయించారు. ఈసారి మంత్రివర్గంలో 17 మంది కొత్తవారికి ఆమె అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమానికి సుమారు 30వేల మంది అతిథులు హాజరయ్యారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, దిల్లీ, యుపి, బిహార్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, నితీష్ కుమార్ తదితరులు ప్రత్యేకంగా హాజరయ్యారు.