జాతీయ వార్తలు

భద్రత, స్వేచ్ఛ ఇస్తామంటే భారత్‌కు వస్తా: మాల్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: తనకు భద్రత, స్వేచ్ఛకు సంబంధించి భరోసా ఇస్తే భారత్‌కు తిరిగి వచ్చేస్తానని లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అంటున్నారు. యునైటెట్ బ్రెవరీర్ లిమిటెడ్ (యుబిఎల్) చైర్మన్ హోదాలో ఆయన లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో తన కంపెనీ డైరెక్టర్లతో మాట్లాడారు. బ్యాంకులకు సుమారు 9వేల కోట్ల రూపాయలను చెల్లించాల్సిన ఆయన భారత్ వస్తే తన భద్రత, స్వేచ్ఛ ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారట. ఈ విషయాన్ని కంపెనీ డైరెక్టర్ ఒకరు మీడియాకు తెలిపారు. బ్యాంకులకు రుణాలు చెల్లించాలన్న ఉద్దేశంతో మాల్యా ఉన్నారని, స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం లభిస్తే అన్ని సమస్యలనూ పరిష్కరిస్తారని ఆయన సన్నిహితులు తెలిపారు.