జాతీయ వార్తలు

కోహినూర్‌ను తిరిగి వెనక్కితేలేం: కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రాన్ని తిరిగి స్వదేశానికి తీసుకురాలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ వజ్రాన్ని తిరిగి భారత్‌కు త తీసుకురావాలంటూ ఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. అలనాడు మహారాజా రంజిత్ సింగ్ ఈ వజ్రాన్ని ఈస్టు ఇండియా కంపెనీకి కానుకగా ఇచ్చారని, దానిని ఎవరూ బలవంతంగా తీసుకుపోలేదని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ కోర్టుకు నివేదించారు. ఆరువారాల్లోగా పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న కోహినూర్‌ను తిరిగి భారత్‌కు అప్పగించాలన్న డిమాండ్ నేపథ్యంలో పిటిషన్ దాఖలైంది.