జాతీయ వార్తలు
కిడ్నాపైన భారతీయ మహిళ క్షేమం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 23 July 2016
ఢిల్లీ: ఆఫ్గనిస్థాన్లోని కాబూల్లో గత నెలలో అపహరణకు గురైన భారతీయ మహిళ జుడిత్ డిసౌజాను కాపాడారు. ఆమె సురక్షితంగా ఉన్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. 40 ఏళ్ల జుడిత్ అంతర్జాతీయ ఎన్జీవో ఆఘా ఖాన్ పౌండేషన్లో సీనియర్ టెక్నికల్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు. జూన్ 9న ఆమెను కార్యాలయం బయట అనుమానిత ఉగ్రవాదులు అపహరించుకుపోయారు. అప్పటినుంచి ఆమెను కాపాడడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆ ప్రయత్నాలు ఫలించి ఆమెను క్షేమంగా కాపాడినందుకు సహాయం చేసిన ఆఫ్గాన్ అధికారులకు సుష్మ ధన్యవాదాలు తెలిపారు. జుడిత్ డిసౌజాను సురక్షితంగా కాపాడారని, అందుకు తనకెంతో సంతోషంగా ఉందని శనివారం ఉదయం ఒక ట్వీట్లో సుష్మ పేర్కొన్నారు.