జాతీయ వార్తలు

‘అగస్టా’పై రెండేళ్లు ఏం చేశారు?:కేజ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్‌డిఎ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంపై ఎందుకు దర్యాప్తు చేపట్టలేదని దిల్లీ సిఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో దోషులను శిక్షించాలంటూ శనివారం ఇక్కడి జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ధర్నాలో కేజ్రీవాల్ ప్రసంగించారు. హెలికాప్టర్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ప్రశ్నించడానికైనా ఎన్‌డిఎ సర్కారుకు దమ్ము లేదన్నారు. ఇకనైనా దోషులకు శిక్షపడేలా అగస్టా వ్యవహారంపై విచారణ జరిపించాలన్నారు.