జాతీయ వార్తలు

నాలుగు జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్‌: కశ్మీర్‌ లోయలో పరిస్థితి కాస్త కుదుటపడడంతో శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో, నాలుగు జిల్లాల్లో అధికారులు కర్ఫ్యూ తీసివేశారు. బందీపొరా, బారాముల్లా, బుద్గాం, గందేర్‌బల్‌ జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తేసినట్లు పోలీసులు తెలిపారు. ఎక్కువ మంది ఒక్కచోట గుమిగూడొద్దంటూ నిషేధాజ్ఞలు జారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా
అనంతనాగ్‌, కుల్గాం, కుప్వారా, పుల్వామా, షోపియాన్‌ జిల్లాల్లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వానిని భద్రతా సిబ్బంది హతమార్చడంతో జులై 9 నుంచి ఘర్షణలు చెలరేగి 40 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.