జాతీయ వార్తలు
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి: జగన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 28 April 2016
దిల్లీ: పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, ఆ అధికారం ఎన్నికల సంఘానికి ఉండాలని వైకాపా అధినేత జగన్ గురువారం ఇక్కడ మీడియాతో అన్నారు. ఎపిలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టిడిపిలో చేరిన విపక్ష ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి గెలిపించుకోవాలని ఆయన సిఎం చంద్రబాబుకు సవాల్ చేశారు. ఉపఎన్నికల్లో ఓడిపోతామన్న భయం బాబును వెంటాడుతోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు భారీగా అక్రమ సంపాదనకు అలవాటుపడినట్లు జగన్ ఆరోపించారు.