జాతీయ వార్తలు

బాబు అవినీతిపై విచారణ జరపాలి: జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ‘సేవ్ డమొక్రసీ’ పేరుతో దిల్లీలో మకాం వేసిన వైకాపా అధ్యక్షుడు జగన్ బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. చంద్రబాబు అవినీతి గురించి రాసిన పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. ఎపిలో బాబు అక్రమాల గురించి విచారణ జరిపించాలని జైట్లీకి విజ్ఞప్తి చేసినట్లు మీడియాకు జగన్ తెలిపారు. ఎపికి ప్రత్యేక హోదా, రైల్వే డివిజన్, తగినన్ని నిధులు ఇవ్వాలని కూడా ఆయన కోరారు. కాగా, సీనియర్ నేత ఎంవి మైసూరారెడ్డి వైకాపాకు రాజీనామా చేయడంపై జగన్ స్పందిస్తూ, ఆయన గత ఆరునెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.