క్రీడాభూమి
ఐఎస్ఎల్ చివరి గ్రూప్ మ్యాచ్లో గోవా చేతిలో ఢిల్లీ పరాజయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్ లో గోవా సిటీ ఫుట్బాల్ క్లబ్ను ఢీకొన్న ఢిల్లీ డైనమోస్ జట్టు 2-3 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ 31వ నిమిషంలో సెర్గియన్హో గ్రీన్, 40వ నిమిషంలో అదిల్ నబీ ఢిల్లీకి గోల్స్ అందించారు. దీనితో 2-0 ఆధిక్యా న్ని సంపాదించిన ఆ జట్టు దాడులకు స్వస్తి చెప్పి, రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. ద్వితీయార్ధంలో గోవా ఆటగాడు రోమియో ఫెర్నాండెజ్ వరుసగా రెండు గోల్స్ చేశాడు. 68, 69 నిమిషాల్లో అతను చేసిన ఈ గోల్స్తో ఇరు జట్ల స్కోరు సమానమైంది. మ్యాచ్ డ్రా అవుతుందన్న అభిప్రాయం సర్వత్రా నెలకొనగా 90వ నిమిషంలో జెఫర్ మాటె గంజాలెజ్ కీలక గోల్ చేసి గోవాను విజయపథంలో నడిపించాడు. ఈ విజయంతో గోవా అగ్రస్థానాన్ని ఆక్రమించగా, కోల్కతా, చెనె్నయన్, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయ.