జాతీయ వార్తలు

గోద్రా కేసులో కీలక నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్: గుజరాత్‌లోని గోద్రా వద్ద 14 ఏళ్ల క్రితం జరిగిన రైలు దగ్ధం ఘటనలో ప్రధాన నిందితుడైన ఫరూఖ్ భానాను ఉగ్రవాద వ్యతిరేక బృందం బుధవారం అరెస్టు చేసింది. 14 ఏళ్లుగా తప్పించుకుతిరుగుతున్న ఫరూఖ్‌ను కలోల్ టోల్ ప్లాజా వద్ద అరెస్టు చేయడం గుజరాత్‌లో సంచలనం కలిగించింది. 2002 ఫిబ్రవరిలో గోద్రా స్టేషన్ సమీపంలో దుండగులు సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పు పెట్టగా 60 మంది మరణించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు 2011 ఫిబ్రవరిలో నిందితులకు శిక్షలు విధించింది. మొత్తం 37 మంది నిందితుల్లో భానాతో పాటు ఆరుగురు పరారీలో ఉన్నారు. 11 మందికి మరణ దండన, 20 మందికి జీవిత ఖైదు విధించారు. తాజాగా భానాను అరెస్టు చేయగా, ఇంకా అయిదుగురు నిందితుల ఆచూకీ తెలియాల్సి ఉంది.