జాతీయ వార్తలు
దిల్లీ వర్సిటీకి హెచ్ఆర్డి మందలింపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 28 April 2016
దిల్లీ: భగత్సింగ్, చంద్రశేఖర్ అజాద్, సూర్యసేన్ వంటి స్వాతంత్య్ర సమరయోధులను ‘రివల్యూషనరీ టెర్రరిస్టుల’ని ఓ పాఠ్యాంశంలో పేర్కొన్నందుకు దిల్లీ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర మానవ వనరులు మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డి) తీవ్రంగా మందలించింది. ప్రముఖ దేశభక్తులైన వీరిని ‘టెర్రరిస్టుల’ని సంబోధిస్తే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని హెచ్ఆర్డి పేర్కొంది. పాఠ్యాంశంలో జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దాలని దిల్లీ వర్సిటీకి హెచ్ఆర్డి ఓ లేఖ రాసింది.