జాతీయ వార్తలు

వర్షం ఆగినా.. మ్యాచ్‌పై వీడని ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: కోల్‌కతలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్ స్టేడియంలో భారత్-పాక్ జట్ల మధ్య ఈరోజు రాత్రి క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. దాయాదుల మధ్య జరిగే మ్యాచ్‌ను వీక్షించేందుకు వేలాదిమంది క్రీడాభిమానులు ఇప్పటికే టిక్కెట్లు కొనుగోలు చేశారు. కోల్‌కతలో ఉదయం నుంచి కురిసిన వర్షం మధ్యాహ్నం సమయానికి ఆగిపోయినప్పటికీ, మ్యాచ్ జరిగేందుకు పిచ్ అనుకూలిస్తుందా? లేదా? రాత్రికి మళ్లీ వర్షం కురుస్తుందా? అనే సందేహాలు రెండు దేశాల ప్రజల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మ్యాచ్‌ను జరగనిచ్చేది లేదని మరోవైపు కొన్ని హిందూత్వవాద సంస్థలు ఇప్పటికే హెచ్చరికలు చేశాయి.