జాతీయ వార్తలు

ఎంపీలకు కాంగ్రెస్ విప్ జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్ తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. మూడు లైన్ల విప్‌లో బుధవారంనాడు సభకు తప్పనిసరిగా హాజరుకావాలని, రాజ్యసభలో చర్చ, ఓటింగ్‌లో పాల్గొనాలని అందులో పేర్కొంది. కాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో దీనిపై స్పందించారు. ఈ బిల్లు లోకసభలో నిన్న 311 ఓట్ల మెజార్టీతో ఆమోదం పొందిన విషయం విదితమే. ఇది భారత రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. మన దేశ వ్యవస్థీకృతపై దాడి చేస్తున్నట్లేనని ఆయన పేర్కొన్నారు. దీంతో పార్టీ కూడా అమీతుమీ తేల్చుకునేందుకు పార్టీ ఎంపీలకు విప్ జారీచేయటం గమనార్హం.