జాతీయ వార్తలు

నిధులు పొందుతున్నా బిజెపికి గుర్తింపు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఏపిలో టిడిపి తీరుపై అధిష్ఠానానికి సత్యనారాయణరావు ఫిర్యాదు
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో బిజెపి నాయకులు, కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వటం లేదని రాష్ట్ర బిజెపి నాయకుడు, విధాన మండలి సభ్యుడు సత్యనారాయణరావు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. సత్యనారాయణరాజు సోమవారం ఇరువురు నాయకులను విడివిడిగా కలిసి ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి పరిస్థితి, తెలుగుదేశం పార్టీ అనుసరిస్తన్న విధానం గురించి వివరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సత్వరాభివృద్ధికి వేలాది కోట్లు కేటాయిస్తోంది, అయితే ఈ నిధులకు సంబంధించిన పథకాల అమలులో రాష్ట్ర బిజెపికి ఎలాంటి పాత్ర లేకుండా పోతోందని పార్టీ అధినాయకులకు వివరించినట్లు రాజు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తమది కాదనే భావన బిజెపి నాయకులు, కార్యకర్తల్లో చోటుచేసుకుంటోందని, ఈ అంశాన్ని తెలుగుదేశం అధినాయకులకు తెలిపినా పట్టించుకోవటం లేదని అమిత్ షా దృష్టికి తెచ్చినట్లు ఆయన తెలిపారు.