జాతీయ వార్తలు
ఎయిర్ ఇండియా విమానంలో బాంబుబూచి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 25 January 2016
దిల్లీ: దిల్లీ నుంచి నేపాల్ రాజధానికి సోమవారం సాయంత్రం బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉందంటూ ఆగంతకులు ఫోన్ చేయడంతో భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. విమానంలో నుంచి ప్రయాణికులందరినీ కిందకు దింపేసి బాంబు కోసం గాలించారు. 108 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది విమానంలో ఉన్నారు. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తమకు వచ్చిన ఫోన్ కాల్తో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమై తనిఖీలు జరిపారు. విమానంలో ఎలాంటి బాంబు లేదని తేలడంతో అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు.