జాతీయ వార్తలు

వేలంలో పాల్గొంటే చంపేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ జర్నలిస్టుకు చోటా షకీల్ హెచ్చరిక

ముంబయి, డిసెంబర్ 5: అజ్ఞాతంలో ఉన్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తుల్లో ఒకదాన్ని వేలంలో కొనడానికి బిడ్డింగ్ దాఖలు చేసిన మాజీ జర్నలిస్టు ఎస్ బాలకృష్ణన్‌ను చంపుతామంటూ బెరిరింపులు వచ్చాయి. వేలంలో పాల్గొంటే చంపుతామని దావూద్ అనుచరుడు చోటా షకీల్ హెచ్చరించినట్టు బాలకృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘షకీల్ నుంచి నేను ఎస్‌ఎంఎస్ అందుకున్నాను. దావూద్ ఆస్తుల వేలంలో పాల్గొంటే.. పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఊహించుకో. బతికి బట్టకట్టాలని ఉందా?’ అంటూ ఎస్‌ఎంఎస్ చేశారని ఆయన వెల్లడించారు. తన ఆధ్వర్యంలో నడుస్తున్న దేశ్ సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థ తరఫున తాను వేలంలో పాల్గొనదలిచానని మాజీ పాత్రికేయుడు తెలిపారు. దేశ్ సేవా సమితి చిన్నపిల్లల సంక్షేమం, మహిళా సాధికారిత కోసం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. వేలంలో స్థలం కొనుగోలు చేసి అక్కడ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్, కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఒకదాన్ని నడపాలని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. బాలలకు ఆదర్శప్రాయుడైన అష్‌ఫఖుల్లాఖాన్ పేరుతో సెంటర్ నడపాలని నిర్ణయించినట్టు బాలకృష్ణన్ వెల్లడించారు. బాలలకు ఖాన్ రోల్‌మోడల్ తప్ప దావూద్ కాదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కడో పాకిస్తాన్‌లో కూర్చుని ఇక్కడ పెత్తనం చేయాలంటే సాగదని ఆయన తీవ్ర హెచ్చరిక చేశారు. ఈ స్థలం దక్షిణ ముంబయిలోని పక్‌మోడియా వీధిలో ఉంది. ఈ నెల 9న కొలాబాలోని హోటల్ డిప్లొమెట్‌లో వేలం వేయనున్నారు.