జాతీయ వార్తలు

విషపూరిత మద్యం సేవించి 17మంది మృత్యువాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసోం: అస్సాంలో దారుణం చోటుచేసుకుంది. విషపూరిత మద్యం సేవించి దాదాపు 17 మంది చనిపోయారు. నిన్న నలుగురు చనిపోగా, శుక్రవారంనాడు 13 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గోలాఘాట్‌లోని సల్మారా టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్న కూలీలు గురువారం రాత్రి వేడుక లో భాగంగా సంజు ఒరాంగ్‌ అనే మద్యం సేవించిన కాసేపటికే ఇద్దరు మహిళలు కుప్పకూలారు. దీంతో వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
శుక్రవారం ఉదయం మరో 13 మంది కూడా అలాగే అపస్మారక స్థితిలో పడిపోవడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. తేయాకు కార్మికులు విషపూరిత మద్యం సేవించటం వల్ల ఈ ఘోరం జరిగిందని భావిస్తున్నారు.