-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
రియాద్, జూలై 4: సౌదీ అరేబియా పట్టణాలైన మదీనా, ఖాటిఫ్, జెద్దాలు సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత బాంబు పేలుళ్లతో దద్దరిల్లాయి. రంజాన్ ఉపవాస నెల చివరి రోజున ఈ దాడులు జరగటం తీవ్రస్థాయిలో ఆందోళనకు దారితీసింది. ఈ సంఘటనల్లో పలువురు మరణించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జరిగిన ఈ పేలుళ్లలో ఆయా మసీదుల వద్ద హాహాకారాలు మిన్నంటాయి.
బీజింగ్: కుండపోత వర్షాల కారణంగా చైనాలో యాంగ్ట్జె నదికి వచ్చిన వరదల్లో 180 మంది మృతి చెందారు. రైల్వేలైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా చోట్ల రహదారులను మూసివేశారు. ఏడు ప్రావిన్సుల్లో 10 నుంచి 50 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కురిసింది. తీవ్రమైన గాలులు వీచాయి. 33మిలియన్ల మంది ప్రజలు అవస్థలు పడగా, 45మంది ఆచూకీ గల్లంతైంది. జుయిఝూ ప్రావిన్స్లో మట్టిపెళ్లలు విరిగిపడి 23మంది మృతి చెందారు.
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఐసిస్ తీవ్రవాదులు సృష్టించిన నరమేధం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఆదివారం జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య సోమవారం ఉదయం నాటికి 213కు చేరింది. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.
బాగ్దాద్, జూలై 3: ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఆదివారం వేకువ జామున జరిగిన రెండు వేర్వేరు బాంబు దాడుల్లో 120మందికి పైగా మృతి చెందగా, మరో 140 మంది గాయపడ్డారని ఇరాక్ అధికారులు తెలిపారు. బాగ్దాద్ నగరం మధ్యలో నిత్యం రద్దీగా ఉండే షాపింగ్ ప్రాంతమైన కరాడాలో జరిగిన శక్తివంతమైన కారుబాంబు దాడిలో వందమందికి పైగా చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు, ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయి.
షిల్లాంగ్, జూలై 3: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఒక రెస్టారెంట్పై దాడి చేసిన ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్న 20 మందిని దారుణంగా నరికి చంపిన సంఘటన తర్వాత మేఘాలయలోని 443 కిలోమీటర్ల భారత్-బంగ్లా సరిహద్దు వెంబడి సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) బలగాలను అత్యంత అప్రమత్తంగా ఉంచినట్లు బిఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు ఆదివారం చెప్పారు.
ఢాకా, జూలై 3: బంగ్లాదేశ్లోని ఒక రెస్టారెంట్పై దాడి చేసి, 20 మందిని బందీలుగా చేసుకొని, హతమార్చింది దేశీయు ఇస్లామిస్టు ఉగ్రవాదులేనని ఆ దేశం ప్రకటించింది. ఈ ఊచకోతతో దిగ్భ్రాంతికి గురయిన బంగ్లాదేశ్ రెండు రోజులపాటు జాతీయ సంతాప దినాలు పాటిస్తోంది.
వాషింగ్టన్, జూలై 3: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల భయాందోళనలు కలిగించే ప్రచారం, హింస విజయవంతం కాలేవని అమెరికా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అన్నారు. బంగ్లాదేశ్లోని ఒక రెస్టారెంట్పై దాడికి దిగిన ఉగ్రవాదులు కొంతమందిని బందీలుగా చేజిక్కించుకొని, అందులోని 20 మందిని ఊచకోత కోసిన నేపథ్యంలో హిల్లరీ బంగ్లాదేశ్ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు.
మెంఫిస్, జూలై 2: అమెరికాలో నలుగురు పిల్లలను కన్నతల్తే హతమార్చింది. పదునైన ఆయుధంలో చిన్నారుల గొంతుకోసి చంపేసినట్టు పోలీసులు తెలిపారు. టనె్సస్సీలో ఈ దారణం చోటుచేసుకుంది. గేటెడ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని అపార్ట్మెంట్లో శుక్రవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో హత్యలు జరిగినట్టు పోలీసు అధికారి ఇర్లే ఫరెల్స్ చెప్పారు. కన్నతల్లే ఇలాంటి ఘాతుకానికి ఎందుకు పాల్పడిందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
బెల్గ్రేడ్, జూలై 2: ఉత్తర సెర్బియాలోని ఓ కేఫ్లో ఒక వ్యక్తి ఐదుగురిని తుపాకీతో కాల్చి చంపేశాడు. మరో ఇరవై మందిని గాయపరిచాడు. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్కు 80కి.మీ. దూరంలోని జిటిస్టే పట్టణంలో శనివారం తెల్లవారుజామున ఈ దారుణం చోటుచేసుకుంది. మృతుల్లో హంతకుడి భార్య కూడా ఉందని పోలీసులు వెల్లడించారు. అనుమానం, ఈర్ష్యతోనే కాల్పులు జరిపాడని వారన్నారు.
ఢాకా, జూలై 2: బంగ్లాదేశ్లో మరో హిందూ పూజారిపై దాడి జరిగింది. సథ్కారియా జిల్లాలోని శ్రీ రాధా గోవింద్ ఆలయ పూజారి బాబా సింధూరాయ్పై గుర్తుతెలియని వ్యక్తులు శనివారం కత్తులతో దాడి చేశారు. ఆలయ ప్రాంగణంలోనే ముష్కరులు పదునైన ఆయుధంలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని పోలీసులు వెల్లడించారు. పూజారి ఇంటి తలుపుపగలగొట్టి లోపలివెళ్లి రాయ్పై తెగబడ్డారు. ఏడెనిమిది మంది దాడి చేసినట్టు పోలీసులు చెప్పారు.