-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
వాషింగ్టన్, సెప్టెంబర్ 26: సంగీతానికి దేశ, ప్రాంత, భాషాపరమైన ఎల్లలు లేవని లెజండరీ మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా అన్నారు. అమెరికాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఇళయరాజా సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ‘‘సంగీతానికి ఒక దేశమంటూ లేదు. దానికి సమయం లేదు. మరేమీ ఉండదు. సంగీతం - కేవలం సంగీతం మాత్రమే.’’ అని అన్నారు.
ఇస్లామాబాద్, సెప్టెంబర్ 26: జమ్ముకాశ్మీర్లోని ఉరీ సెక్టార్లోని ఆర్మీ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడిపై నిష్పక్షపాతంగా అంతర్జాతీయ విచారణ జరగాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది. ఈ దాడిలో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు పాల్గొన్నారంటూ భారత్ నిరాధార ఆరోపణలు చేస్తోందని పాక్ ప్రధానికి విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ సోమవారం విమర్శించారు.
న్యూయార్క్, సెప్టెంబర్ 26: పాకిస్తాన్తో శాంతి చర్చలు జరిపేందుకు భారత్ ఎన్నడూ షరతులు పెట్టలేదని భారత్ ఐరాస వేదికపై సభ్య సమాజం ముందు కుండబద్ధలు కొట్టింది. కాశ్మీర్ ఎన్నటికీ భారత్లో అంతర్భాగమేనని..దీన్ని చేజిక్కించుకోవాలన్న పాక్ కలలు కల్లలేనని విస్పష్టంగా తెలిపింది.
బీజింగ్, సెప్టెంబర్ 25: విశ్వంలో జీవుల అనే్వషణకు చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయత్నాన్ని ప్రారంభించింది. వందలాది వ్యోమగాములు, అంతరిక్ష పరిశోధక విద్యార్థులు, ఆసక్తిపరుల సాక్షిగా అతి పెద్ద టెలిస్కోప్ పరీక్షను ప్రారంభించింది. ఇది అలాంటిలాంటి టెలిస్కోప్ కాదు. 30 ఫుట్బాల్ మైదానాల విస్తీర్ణం ఎంత ఉందో.. ఈ టెలిస్కోప్ విస్తీర్ణం అంతది.
న్యూయార్క్, సెప్టెంబర్ 25: భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆదివారం న్యూయార్క్ చేరుకున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 71వ సమావేశంలో ప్రసంగించడానికి ఆమె ఇక్కడికి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం సుష్మాస్వరాజ్ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తారు. భారత్ అంతర్గత అంశమైన కాశ్మీర్పై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె తన ప్రసంగంలో గట్టి సమాధానం ఇస్తారని భావిస్తున్నారు.
ఇస్లామాబాద్, సెప్టెంబర్ 25: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని పాకిస్తాన్ ఆరోపించింది. కాశ్మీర్నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి భారత ప్రభుత్వం రూపొందించుకున్న ‘దురుద్దేశపూరితమైన, పకడ్బందీ వ్యూహం’లో భాగమే ఆయన వ్యాఖ్యలని కూడా దుయ్యబట్టింది.
లాహోర్, సెప్టెంబర్ 25: ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి, ఇతర అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ వివాదాన్ని లేవనెత్తాల్సిందిగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జెయుడి చీఫ్, 26/11 ఉగ్రవాద దాడి సూత్రధారి హఫీజ్ సరుూద్ దాఖలు చేసిన పిటిషన్ను లాహోర్ హైకోర్టు కొట్టివేసింది.
ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 24: ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ను అంతర్జాతీయ సమస్య చేయడానికి పాకిస్తాన్ నెలలుగా చేసిన ప్రయత్నాలకు ఐరాసలో ప్రపంచ దేశాలనుంచి ఎలాంటి ప్రతిస్పందనా లభించలేదని, పెరిగిపోతున్న ఉగ్రవాదంపైనే ప్రపంచ దేశాలన్నీ దృష్టిపెట్టాయని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అన్నారు.
ఇస్లామాబాద్, సెప్టెంబర్ 24: జమ్మూ, కాశ్మీర్లోని ఉరీలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్లో పరిస్థితులకు ప్రతి చర్యగానే ఉరీ ఘటన జరిగి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం న్యూయార్క్నుంచి స్వదేశానికి తిరిగివెళ్తూ షరీఫ్ శుక్రవారం లండన్లో ఆగారు.
లాహోర్, సెప్టెంబర్ 24: పాకిస్తాన్పై ఒకవేళ ఎవరైనా బయటివారు దాడి చేసినట్లయితే తమ పూర్తి మద్దతు ఉంటుందని చైనా ఆ దేశానికి హామీ ఇచ్చింది. అంతేకాదు కాశ్మీర్ విషయంలో పాక్ వైఖరిని సైతం చైనా సమర్థించిందని పాక్ మీడియా కథనం పేర్కొంది. లాహోర్లో చైనా కాన్సుల్ జనరల్ యు బోరేన్ శుక్రవారం పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్తో భేటీ అయిన సందర్భంగా ఈ హామీ ఇచ్చినట్లు పాక్ దినపత్రిక ‘డాన్’ తెలిపింది.