మరణానంతరం నలుగురికి ప్రాణదానం
Published Wednesday, 24 June 2015విజయవాడ, జూన్ 23: అవయవదానాల పట్ల ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన వెల్లివిరుస్తున్నది. కృష్ణాజిల్లా కేసరిపల్లికి చెందిన పి. నాగబాబు (24) ఈనెల 18వ తేదీ ప్రమాదానికి గురై మెదడుకు తీవ్ర దెబ్బతగిలింది. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. తల్లిదండ్రులు జీవన్ధాన్ సంస్థను ఆశ్రయించి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. జీవన్ధాన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవిరాజు వైద్య ప్రముఖులందరినీ క్షణాలపై రప్పించి మృతదేహం నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, రెండు కళ్లను తొలగించారు.