తెలంగాణ
హెచ్సియుకి నేడు మాయావతి రాక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 January 2016
హైదరాబాద్: రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య అనంతరం హెచ్సియు లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతు పలికేందుకు యు.పి. మాజీ ముఖ్యమంత్రి, బిఎస్పీ అధినేత్రి మాయావతి, సిపిఎం నేత సీతారాం ఏచూరి, లోక్జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ తదితరులు నేడు వర్సిటీకి వస్తున్నారు. దిల్లీ సిఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఇక్కడికి వస్తారని సమాచారం. రాజకీయ నాయకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో వర్సిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు.