ఆంధ్రప్రదేశ్
టిడిపి ఎంపీలతో రేపు చంద్రబాబు భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 30 July 2016
విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ రాజ్యసభలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న టిడిపి ఎంపీలతో ఆ పార్టీ అధినేత, సిఎం చంద్రబాబు ఆదివారం ఇక్కడ భేటీ అవుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్రం నుంచి ఆర్థిక సాయం, ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరి తదితర అంశాలపై ఆయన ఎంపీలతో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీరు అసంతృప్తి కలిగిస్తోందని, రాష్ట్రం కోసం అవసరమైతే రాజీనామాలకైనా సిద్ధమేనని రాజమండ్రి ఎంపీ, సినీనటుడు మురళీమోహన్ ప్రకటించడం ఈ సందర్భంగా గమనార్హం.