ఆంధ్రప్రదేశ్
కాసేపట్లో ముద్రగడ దీక్ష విరమణ?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 22 June 2016
కాకినాడ: రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో 13 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తన స్వస్థలమైన కిర్లంపూడికి బయలుదేరారు. తుని విధ్వంసకాండకు సంబంధించి అరెస్టు చేసిన వారందరినీ బెయిల్పై విడుదల చేయడంతో ఆయన కిర్లంపూడికి బయలుదేరారు. బెయిల్పై విడుదలైనవారిని, తనను పోలీసు వాహనంలో కిర్లంపూడిలోని తన ఇంటి వద్దకు చేర్చాలన్న ఆయన డిమాండ్ను ప్రభుత్వం తిరస్కరించింది. ఇంటికి చేరుకున్న తర్వాత ముద్రగడ దీక్ష విరమిస్తారని సమాచారం.