ఆంధ్రప్రదేశ్
అల్లవరంలో పంట విరామం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 20 June 2016
అల్లవరం, జూన్ 19: ప్రభుత్వం సకాలంలో సాగునీరు అందించని కారణంగా పంట విరామం పాటించాలని తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని అల్లవరం మండలానికి చెందిన అయిదు గ్రామాల రైతులు నిర్ణయించారు. మండలంలోని రెల్లుగడ్డ గ్రామంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. పికెఎస్ నాయకుడు డొక్కా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెల్లుగడ్డ, మొగలముర్రు, తూర్పులంక, అల్లవరం, గుండెపూడికి చెందిన రైతులు పాల్గొన్నారు. డ్రైయిన్లు, పంట కాలువల మరమ్మతులు జరపకుండా వ్యవసాయం చేయలేమని సమావేశంలో పాల్గొన్న రైతులు స్పష్టంచేశారు. ఈ అయిదు గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంటుంది.
చిత్రం.. పంట విరామంపై చర్చిస్తున్న రైతులు