తెలంగాణ
చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 June 2016
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిన సోదరులచే చేప ప్రసాదం పంపిణీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. చేప ప్రసాదం తీసుకునేందుకు ఎపి, తెలంగాణ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా రోగులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రద్దీని నివారించేందుకు 32 కౌంటర్లను ఏర్పాటు చేసి ముందుగా టోకెన్లు ఇస్తున్నారు. సుమారు 1,500 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎగ్జిబిషన్ మైదానం వైపు ఈరోజు, రేపు ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.