ఆంధ్రప్రదేశ్
ఆ దుష్ప్రచారం కొందరిదే: అశోక్బాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 6 June 2016
విజయవాడ: అమరావతికి వెళ్లడానికి ఇష్టం లేని కొద్దిమంది ఉద్యోగులు చేస్తున్న దుష్ప్రచారంతో ఉద్యోగుల సంఘానికి సంబంధం లేదని ఎపి ఎన్టీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు అన్నారు. ఆగస్టు నాటికి అన్ని ప్రభుత్వ విభాగాలు అమరావతికి వెళ్లాల్సిందేనని అన్నారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవనాలతో పాటు ప్రైవేటు భవనాలలోకి ఎపి కార్యాలయాలు వెళతాయని అన్నారు. హెచ్ఆర్ఎ, 5 రోజుల పనిదినాలు వంటి విషయాలపై ప్రభుత్వం ఇప్పటికే జీవోలు జారీ చేసిందని ఆయన గుర్తుచేశారు. కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ సిఎం ఆదేశాల మేరకు ఉద్యోగుల తరలింపు పూర్తవుతుందని ఆయన చెప్పారు.