ఆంధ్రప్రదేశ్
కరోనాను మించిన వైసీపీ అరాచకత్వం: కళా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 22 March 2020
గుంటూరు, మార్చి 21: ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తుంటే రాష్ట్రాన్ని జగరోనా వణికిస్తోందని, కరోనా కంటే వైసీపీ నేతలు ప్రమాదకరంగా తయారయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావ్ విమర్శించారు. శనివారం మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం నుండి ఆయన ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా గాలికొదిలేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిపక్ష అభ్యర్థులపై వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు.