ఆంధ్రప్రదేశ్
పేదల పొట్టకొట్టే ప్రయత్నాలు మానుకోవాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 6 March 2020
గుంటూరు, మార్చి 5: అమరావతి శ్మశానమని, అక్కడ గేదెలు, పందులు తిరుగుతున్నాయే తప్ప ఎవరూ నివాసం ఉండటం లేదని చెప్పిన ప్రభుత్వ పెద్దలు నేడు అదే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తున్నారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిలదీశారు. మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు పేదల సంక్షేమంపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పీఠమెక్కాక పేదల పొట్టకొట్టే చర్యలకు పాల్పడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు.