ఆంధ్రప్రదేశ్
జగన్ అక్రమాస్తుల కేసులో శ్యాంప్రసాద్ రెడ్డికి ఊరట
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 April 2016
హైదరాబాద్, ఏప్రిల్ 14: జగన్ అక్రమాస్తుల కేసులో ఇందూ గ్రూప్ చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి ఈ కేసును విచారిస్తున్న సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు ఇస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో శ్యాంప్రసాద్ రెడ్డిపై సిబిఐ మూడు కేసుల్లో అభియోగాలను మోపింది. ఈ కేసులను సిబిఐ కోర్టు ప్రతి శుక్రవారం విచారిస్తోంది. పిటిషనర్ శ్యాంప్రసాద్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది కె శ్రీనివాసరెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు సిబిఐ కోర్టు విచారణకు శ్యాంప్రసాద్ రెడ్డి హాజరుకాకుండా మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు హైకోర్టు జడ్జి జస్టిస్ రాజా ఎలాంగో ఆదేశాలు ఇచ్చారు.