విజయవాడ

తూర్పు నియోజకవర్గాన్ని ‘మోడల్’గా తీర్చిదిద్దుతా:గద్దె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, మార్చి 18: విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుధవారం ఉదయం తాను నామినేషన్ శాసనసభ్యులు గద్దె రామమోహన్ తెలిపారు. సోమవారం అశోక్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటానికి అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఉదయం 8 గంటలకు పటమటలంక కృష్ణవేణి పాఠశాల రోడ్డులోని మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఖాళీ స్థలం నుంచి పాదయాత్రగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు. ఈ నామినేషన్ కార్యక్రమాన్ని మిత్రులు, శేయోభిలాషులు, సహచరులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు గమనించి ప్రతి ఒక్కరూ చంద్రబాబుకు అండగా తెలుగుదేశం పార్టీని, ప్రజాసేవకు అంకితమైన గద్దె రామ్మోహన్ అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ముమ్మనేని ప్రసాద్, ఎస్సీసెల్ అధ్యక్షుడు జీవీ నరసింహారావు, కామా దేవరాజ్, పొట్లూరి సాయిబాబు, పేరేపి ఈశ్వర్, చలసాని రమణ, తదితరులు పాల్గొన్నారు.