తెలంగాణ
నాలుగో రోజూ వైభవంగా చండీయాగం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 26 December 2015
మెదక్: తెలంగాణ సిఎం కెసిఆర్ మెదక్ జిల్లా ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ వద్ద నిర్వహిస్తున్న అయుత చండీయాగం నాలుగో రోజు శనివారం వేడుకగా జరుగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పూజలు, హోమాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఎన్సిపి నాయకుడు శరద్ పవార్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎస్వి రమణ, కాంగ్రెస్ నేతలు టి.సుబ్బిరామిరెడ్డి, గీతారెడ్డి తదితర ప్రముఖులు యాగానికి హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి మహిళలు భారీగా తరలివచ్చారు.