తెలంగాణ
యాగానికి హాజరైన ఎపి సిఎం చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 27 December 2015
మెదక్: తెలంగాణ సిఎం కెసిఆర్ ఎర్రవల్లిలో తన ఫామ్ హౌస్ వద్ద నిర్వహిస్తున్న అయుత చండీయాగం కార్యక్రమాలు అయిదో రోజు ఘనంగా జరిగాయి. ఎపి సిఎం చంద్రబాబు చివరి రోజు యాగానికి వచ్చిన సందర్భంగా ఆయనకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఇద్దరు సిఎంలు యాగంలో పాల్గొన్నారు. చంద్రబాబు వెంట ఎపి మంత్రులు కెఇ కృష్ణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి తదితరులు వచ్చారు. వీరందరినీ కెసిఆర్ పట్టు శాలువలతో సత్కరించి తీర్థప్రసాదాలు, జ్ఞాపికలు అందజేశారు. యాగానికి చంద్రబాబు ప్రత్యేకంగా విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలను తీసుకునివచ్చారు.