తెలంగాణ

కోలాహలంగా సింధు విజయోత్సవ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్ చేరుకున్న షటిల్ బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌కు సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, క్రీడాభిమానులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. తెలంగాణ మంత్రులు మహమ్మద్ అలీ, నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, మహేందర్ రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎపి మంత్రులు దేవినేని ఉమా, నిమ్మకాయల చినరాజప్ప, విజయవాడ ఎంపీ కేశినేని నాని, వివిధ పార్టీల నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టు నుంచి విజయోత్సవ ర్యాలీ కోలాహలంగా ప్రారంభమైంది. దారి పొడవునా సింధుకు క్రీడాభిమానులు స్వాగతం పలికారు. విజయోత్సవ ర్యాలీ అనంతరం ఎల్‌బి స్టేడియంలో జరిగే అభినందన సభలో ఆమెను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. విజయోత్సవ ర్యాలీకి హైదరాబాద్ నగర పాలక సంస్థ విస్తృత ఏర్పాట్లు చేసింది.