తెలంగాణ
వడదెబ్బకు నలుగురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 1 April 2016
నల్లగొండ, వరంగల్, మార్చి 31: వరంగల్, నల్లగొండ జిల్లాలో వడదెబ్బకు అస్వస్థతకు గురై నలుగురు మరణించారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే ముగ్గురు మరణించారు. ఆత్మకూర్ (ఎస్) మండలం గట్టికల్ గ్రామానికి చెందిన మర్రి వెంకన్న (40)అనే తాపిమేస్ర్తీ వడదెబ్బతో అస్వస్థతకు గురై గురువారం మృతిచెందాడు. చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన కోరబోయిన నర్సింహ (50) అనే లారీడ్రైవర్, కోదాడ బొడ్రాయి బజార్కు చెందిన వృద్ధురాలు పందిరి పుల్లమ్మ (85) వడదెబ్బతో మృతిచెందారు. అలాగే, వరంగల్ జిల్లా మొగుళ్ళపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన శ్రీరాం సమ్మయ్య (57) అనే వ్యక్తి వడదెబ్బకు గురై మృతిచెందాడు.