తెలంగాణ

ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటిక్యాల, మార్చి 29: ముక్కుపచ్చలారని చిన్నారులను అతికిరాతకంగా చంపిన కసాయి తండ్రి తాను కూడా ఉరి వేసుకుని తనువు చాలించిన హృదయవిదారక సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా, మానవపాడు మండల పరిధిలోని పల్లెపాడు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనను చూసిన గ్రామస్థులకు కంటతడి పెట్టించింది.
మృతి చెందిన తండ్రి, కొడుకులను చూసేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. అలంపూర్ సిఐ వెంకటేశ్వర్లు, గ్రామస్థుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ పట్టణంలోని షరీఫ్‌నగర్‌కు చెందిన ఇషాక్ (34)కు పల్లెపాడు గ్రామానికి చెందిన రమాదేవితో ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి సంతానం సిద్దార్థ (4), బాబు (2). భార్యాభర్తలు కలిసి గుడ్‌ఫ్రైడే సందర్భంగా పల్లెపాడు గ్రామానికి వచ్చారు. సోమవారం కర్నూల్‌కు వెళ్లేందుకు ఇషాక్ ప్రయాణం కాగా డబ్బుల విషయమై ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుని భార్యను వదిలిపెట్టి మనస్తాపం చెందిన భర్త ఇద్దరి పిల్లలతో కర్నూల్‌కు బయలుదేరాడు. మార్గమధ్యంలో బోరవెల్లి-పల్లెపాడు మధ్య గడ్డమీది గోకారి పొలంలో పిల్లలను అతికిరాతంగా కొట్టి ఉరివేసి తను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం పొలాలకు వెళ్తున్న రైతులు గమనించి గ్రామానికి సమాచారాన్ని ఇవ్వడంతో సంఘటన స్థలం వద్దకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చేరుకొని మృతదేహాలను గుర్తుపట్టారు. అనంతరం అలంపూర్ సిఐ వెంకటేశ్వర్లుకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి కోదండాపురం ఎస్‌ఐ మహేశ్వర్‌రావు, ఎఎస్‌ఐ బుచ్చిబాబులు చేరుకున్నారు. మృతి చెందిన వారిపై కుటుంబ సభ్యులతో విచారణ చేపట్టి పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
పల్లెపాడు గ్రామంలో
విషాద ఛాయలు..
పల్లెపాడు గ్రామంలో కర్నూల్ పట్టణానికి చెందిన ఇషాక్, అతని చిన్నారి కుమారులు మృతిపై గ్రామంలో విషాదఛాయలు చోటుచేసుకున్నాయి. ఈ ఆత్మహత్యలు చూసి కుటుంబ సభ్యులు చలించిపోయారు. చిన్నారులను కన్నతండ్రే అతికిరాతకంగా చంపివేయడంపై ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు.