తెలంగాణ

వడదెబ్బకు ఏడుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ/కరీంనగర్, మార్చి 25: వడదెబ్బ తీవ్రతతో నల్లగొండ జిల్లాలో నలుగురు, వరంగల్ జిల్లాలో ఇద్దరు, కరీంనగర్ జిల్లాలో ఒకరు మరణించారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన ఆక శరత్ (19) భువనగిరిలోని గురుకుల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్వంత పనులపై గ్రామానికి రాగా తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తుండగా సృహ తప్పి పడిపోయాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. హుజూర్‌నగర్ మండలం గోపాలపురం గ్రామంలో శుక్రవారం షేక్ వౌలానా (68) అనే వ్యక్తి వడదెబ్బతో మరణించాడు. మిర్యాలగూడ మండల కేంద్రానికి చెందిన దైద మైసయ్య (60) శుక్రవారం గుడ్‌ఫ్రైడే కావడంతో స్థానికంగా ఉన్న చర్చిలో ప్రార్ధనలు చేసి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం మిర్యాలగూడకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చె ందాడు. మిర్యాలగూడ మండలం వాటర్‌ట్యాంక్ తండాకు చెందిన పదో తరగతి విద్యార్ధిని అనిత (15) వడ దెబ్బకు గురై శుక్రవారం మరణించింది. గురువారం పదో తరగతి పరీక్షకు హాజరై ఎండలో రావడంతో అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం కనిపించలేదు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పట్టణానికి చెందిన భారతి దోబో (20) శుక్రవారం వడదెబ్బతో మృతి చెందింది. వరంగల్ జిల్లా నర్మెట మండలం బొమ్మకూరు గ్రామానికి చెందిన ఉప్పాల నర్సమ్మ (52) ఉపాధి హామీ పనికి వెళ్లి వడదెబ్బతో అస్వస్థతకు గురైంది. వరంగల్ ఎంజిఎంకు తరలించగా చికిత్స పొందుతూ నర్సమ్మ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. అదేవిధంగా లింగాలఘణపురం మండలంలోని వడిచెర్ల గ్రామానికి చెందిన ఎండి. అబ్దుల్లాబీ (56) వడదెబ్బకు గురై మరణించింది.