తెలంగాణ

బెట్టింగ్‌కు విద్యార్థి బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, మార్చి 24:క్రికెట్ బెట్టింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోని గోకారం గ్రామానికి చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి పాలకూర్ల భానుప్రసాద్ గురువారం ఉదయం ఇంట్లో ఏవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోకారం గ్రామానికి చెందిన భానుప్రసాద్ అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద గల అర్జున్ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడిన భానుకు ఇదే విషయమై స్నేహితులతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బెట్టింగులు ఓడిపోయిన కారణంగా డబ్బు ఇవ్వాల్సి ఉందని, ఆ డబ్బుకోసం స్నేహితులు వేధించడంతో భాను ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టమ్ నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.