తెలంగాణ

నదిలో మునిగి ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతినగర్, మార్చి 24: మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మండల పరిధిలోని రాజోళి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు తుంగభద్ర నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. రాజోళి ఎస్‌ఐ జయశంకర్ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజోళి గ్రామానికి చెందిన దాదాపు 14 మంది యువకులు హోలీ సంబరాల్లో భాగంగా బుధవారం రంగులు చల్లుకుని సాయంత్రం సుంకేసుల బ్యారేజీ కింది భాగాన ఉన్న నీటిలో స్నానం చేస్తున్న కె.కృష్ణచైతన్య (18), భార్గవ్ (19) ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందారు. గురువారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా రెండు మృతదేహాలు లభించాయ. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడు కృష్ణచైతన్య తండ్రి రాఘవేంద్రప్రసాద్ ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతి చెందిన యువకులు కర్నూల్ నగరంలో డిగ్రీ చదువుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.